Friday, September 18, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad
కామారెడ్డి

బిక్కనూరుకు మంజూరైన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను తరలించొద్దు

మండలంలోనే అనుకూలమైన స్థలంలో నిర్మించాలి...అధికార పార్టీ నాయకులు చొరవ చూపాలి -లేకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమం !
SAI MANIKANTA
September 18, 2026 · 4 hours క్రితం
6 Views 0 Shares

బిక్కనూరు, సెప్టెంబర్‌ 18 (నవజ్యోతి ప్రతినిధి):

బిక్కనూరు మండలానికి మంజూరైన యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ను కామారెడ్డి మండలం క్యాసంపల్లికి తరలించే నిర్ణయాన్ని నిలిపివేసి, బిక్కనూరు మండలంలోనే అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి పాఠశాలను నిర్మించాలని బీఆర్‌ఎస్‌ మండల శాఖ నాయకులు డిమాండ్‌ చేశారు. మండలానికి మంజూరైన పాఠశాలను ఇతర ప్రాంతానికి తరలించడం వల్ల బిక్కనూరు మండల ప్రజలకు నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

బిక్కనూరు మండల పరిధిలోనే అందుబాటులో ఉన్న అనుకూలమైన స్థలాన్ని గుర్తించి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాల తరలిపోకుండా మండలంలోని అధికార పార్టీ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు.

బిక్కనూరు మండలానికి మంజూరైన పాఠశాలను తరలించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. పాఠశాల తరలింపుపై ప్రభుత్వం – అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మండలానికి మంజూరైన విద్యా సంస్థ ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల బిక్కనూరు పరిధిలోని విద్యార్థులకు – తల్లిదండ్రులకు ప్రయోజనం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. అందువల్ల పాఠశాల నిర్మాణానికి బిక్కనూరు మండలంలో అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని కోరారు.

పాఠశాల తరలింపును అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. బిక్కనూరు మండలానికి మంజూరైన పాఠశాలను మండలంలోనే ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌ అత్తేల్లి, అందె మహేందర్‌, తునికి వేణు, రాంచంద్రం వెంకటరెడ్డి, మధుసూదన్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.