Wednesday, September 16, 2026
నవజ్యోతి తెలుగు దినపత్రిక
Navajyothi Header Ad

జైస్వాల్‌-ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం

LAXMAN
LAXMAN
August 23, 2026 తాజా వార్తలు

భారత్‌-శ్రీలంక రెండో టెస్టులో ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. తొలి రోజు లంచ్‌ విరామానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ చివరి బంతికి ఫెర్నాండో అద్భుతమైన బంతితో జైస్వాల్‌ను బౌల్డ్‌ చేశాడు. వికెట్‌ తీసిన ఆనందంలో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అయితే జైస్వాల్‌ మైదానం వీడుతున్న సమయంలో ఫెర్నాండో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతడిని నిలదీశాడు ఒకరికొకరు అత్యంత సమీపంలోకి.. ఆగ్రహానికి గురైన జైస్వాల్‌ ఫెర్నాండో వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరికొకరు అత్యంత సమీపంలోకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని ఇద్దరినీ శాంతింపజేశారు. మూడు వరుస బౌండరీలు ఈ ఘటనకు ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే జైస్వాల్‌ వరుసగా మూడు బంతుల్లో మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాతి బంతికే అతడు బౌల్డ్‌ కావడంతో ఫెర్నాండో దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.